మూడేండ్లలో అమరావతి పూర్తి- మంత్రి నారాయణ

మూడు సంవత్సరాలలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రకటించారు. ఏసీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలలో రాజధాని అమరావతి విషయంలో సభ్యులు సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. అమరావతి పనుల పూర్తికి 64వేల 721 కోట్లతో ఎస్టిమేషన్ వేశామని.. టెండర్లు కొనసాగుతున్నాయని చెప్పారు. 2019-24లో వచ్చిన రాజకీయ అనిశ్చితి వల్ల అమరావతి నిర్మాణంలో ఇబ్బందులు వచ్చాయని చెప్పుకొచ్చారు. 2028కి రైతులకు ఇవ్వాల్సిన లే అవుట్‌లు వేసి ఇస్తామని తెలిపారు


Published on: 12 Mar 2025 14:03  IST

అమరావతి రాజధానిని 2014-19న నిర్ణయించినప్పుడు ఇదే సభలో వైఎస్ జగన్ ఆమోదం తెలిపారని… ప్రభుత్వం మారాక మూడుముక్కలాడారని మండిపడ్డారు నారాయణ. రాజధాని రైతులు ఎంతో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. 58 రోజుల్లో ఒక్క లిటిగేషన్ లేకుండా భూములు ఇచ్చారని.. ఈ ఏడు, ఎనిమిది నెలలు హర్డిల్స్ అన్నీ దాటి టెండర్లను పిలిచామని చెప్పారు. వరల్డ్ బ్యాంకు, ఏడీబీ 13400 కోట్లు మంజూరు చేసిందని, కెఎఫ్‌డబ్ల్యూ బ్యాంకు రూ.5 వేల కోట్లు ఇచ్చిందని.. అలాగే హడ్కో రూ.11 వేల కోట్లు ఇస్తోందని తెలిపారు. అంతేకాకుండా రూ.1560 కోట్లు కేంద్రం గ్రాంటు కింద ఇస్తోందని వెల్లడించారు.

మూడేళ్లలోనే అమరావతి నిర్మాణం

రాజధానిని మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. మెయిర్ రోడ్డులు 2 సంవత్సారాల్లో పూర్తి చేస్తామని.. ఎల్‌పీఎస్ రోడ్లు, డ్రైన్లు మూడు సంవత్సారాల్లో పూర్తి చేస్తామన్నారు. అమరావతి రాజధానికి జగన్ ముందు ఒప్పుకొని తరువాత ప్లేటు ఫిరాయించారని మండిపడ్డారు. దీంతో అయిదేళ్ల పాటు రైతులు సఫర్ అయ్యారన్నారు. అసెంబ్లీ, హైకోర్టు 3 సంవత్సారాల్లో పూర్తవుతాయని వెల్లడించారు. 136 ఆర్గనైజేషన్లుకు 1277 ఎకరాలు ఇచ్చామని.. గత అయిదేళ్ల పరిణామాల వల్ల కొందరు వెనెక్కి వెళ్లారని తెలిపారు. 31 ఆర్గనైజేషన్‌లకు 629.3 ఎకరాలకు అంగీకారం తెలిపామన్నారు. 13 సంస్ధలకు ఇచ్చిన భూములు రద్దు చేశామన్నారు. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రచ్చర్, రోడ్డు, స్ట్రామ్ వాటర్, వాకింగ్ ట్రాక్స్ వంటి ఫెసిలిటీస్‌తో ఉన్నాయన్నారు. 1280 ఎల్‌పీఎస్‌ రోడ్లకు టెండర్లు పిలిచామన్నారు. కొండవీటి వాగు, వాగు గ్రావీటీ కెనాల్‌లకు టెండర్లు పిలిచామన్నారు. మొత్తం 73 వర్కులకు రూ.64,721 కోట్లు ఎస్టిమేషన్ వేశామని… వీటిలో 62 పనులను టెండర్లు అయిపోయాయని చెప్పారు. గత ముఖ్యమంత్రి 50 వేల మందికి సెంటు లెక్కన ఇచ్చారన్నారు. ఆర్‌ఫైవ్ జోన్ క్రియేట్ చేశారని… వారికి ఆల్టర్నేట్ స్ధలం ఇచ్చి ఆ భూమిని కూడా తీసుకుంటామని మంత్రి నారాయణ సభలో పేర్కొన్నారు.

Source From: minister narayana